మహాత్మా జ్యోతిబా పూలే (బిసి) పాఠశాలలో ప్రవేశ దరఖాస్తులకు ఆహ్వానం
- 2025- 26 విద్యా సంవత్సరానికి గాను ఖాళీల భర్తీకి ఆహ్వానం
- 5 నుండి 9 తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు సదావకాశం
- ఈ నెల 31 వరకు దరఖాస్తులు చేసుకోవాలి
- మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల బాలికల పాఠశాల (పాల్వంచ) ప్రిన్సిపాల్ ఎన్. ఎ. క్రాంతి
లోకల్ గైడ్ తెలంగాణ,పాల్వంచ :మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల నందు 5,6,7,8,9 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి గాను ఖాళీగా వున్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తులకు ఆహ్వానం పలుకుతున్నట్టు ఎమ్ జె పి టి బిసి బాలికల పాఠశాల (పాల్వంచ) ప్రిన్సిపాల్ ఎన్.ఎ. క్రాంతి ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.5 నుండి 9 వ, తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థుల ప్రవేశం కొరకు ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉందని అన్నారు. ఏప్రిల్ 20 తేదీన జరిగే ప్రవేశ పరీక్ష నందు ప్రతిభ కనబర్చిన, రిజర్వేషన్ ఆధారితంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రవేశాల కొరకు ఈ క్రింది వెబ్సైట్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. https://mjptbcadmissions.org/ లేదా www.mjptbcwrels.telangana.gov.in
Comment List