కేటీఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మల దగ్ధం
లోకల్ గైడ్ తెలంగాణ, వరంగల్ జిల్లా ప్రతినిధి:
టీపీసీసీ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలనకు నిరసనగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అధ్యక్షతన వరంగల్ చౌరస్తా సెంటర్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.ఈ సందర్బంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులకి హెచ్చరిక చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు మా ముఖ్యమంత్రి పైన గానీ ,మంత్రులపై గానీ, ఎమ్మెల్యేలపై గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై గానీ చేసిన చూస్తూ ఊరుకోమని తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్, బస్వారాజు శిరీష శ్రీమాన్,మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, జన్ను అరుణ్,జన్ను రవి దామెర సర్వేశ్వర్, ఆడువాల గిరిధర్, బిళ్ళ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోరంటల రాజు, చాగంటి శ్రీనివాస్, కరాటే ప్రభాకర్,బోలుగొడ్డు శ్రీనివాస్,చంద్రమౌళి,కోదాటి అనిల్, దామోదర్, బొక్క భాస్కర్,ఎండి. మస్తాన్, జన్ను శ్యామ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కుసుమ వరుణ్, యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షులు సలీమ్, నాయకులు బండారి సదానందం, జంజిరాల వేణు,ఉమేందర్, కత్తెరశాల గణేష్, బండ్ల సురేందర్, ఇమ్రాన్, రమేష్, రాముల బాబు,అరెల్లి రవి, బాలు, వేణు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List