అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
టీజేయు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పోతుల దిలీప్ యాదవ్.
లోకల్ గైడ్ తెలంగాణ, మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (టిజేయూ) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు పోతుల దిలీప్ మాట్లాడుతూ.. జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేయాలి. ఉన్న సమస్యలను వెలికి తీసి, ఉన్నది ఉన్నట్లుగా నిర్భయంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా జర్నలిస్టు పనిచేయాలని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు మహబూబాబాద్ జిల్లాలో బిలో ప్రాపర్టీ కింద అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహబూబాద్ జిల్లా అధ్యక్షులు పోతుల దిలీప్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్ల గోవర్ధన్ యాదవ్, ఉపాధ్యక్షులు దొంతు నరసయ్య, సహాయ కార్యదర్శి మట్ల కిషోర్, కోశాధికారి చిలకామారి గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comment List