అమెరికాలో తెలుగు వాసులు మృతి!... తీవ్ర దుఃఖంలో కుటుంబం
By Ram Reddy
On
లోకల్ గైడ్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక కుటుంబం అమెరికాలో మృతి చెందిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హర్వీన్(6), కోడలు సునీత (56) మృతులుగా గుర్తించడం జరిగింది. కాగా ఒకే కుటుంబంలో ముగ్గురు ఒక్కసారిగా కన్నుమూయడంతో టేకులపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఇంకా మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Mar 2025 17:38:55
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
Comment List