'ప్రజా పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం.

'ప్రజా పాలన'లోనే ప్రతి పేదవాడికి కడుపు నిండా భోజనం.

గుర్రంపల్లి రేషన్ డీలర్ బండి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సన్వ వల్లి.పెంటయ్య.

గుర్రంపల్లి గ్రామ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ .

సన్న బియ్యం పంపిణీతో హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.

లోకల్ గైడ్, జిల్లేడు చౌదరి గూడెం. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా పాలనలో ప్రతి నిరుపేద కుటుంబం కడుపు నిండా భోజనం చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సన్నబియ్యం పథకం ప్రారంభించడం ఎంతో హర్షణీయమని గుర్రంపల్లి గ్రామ రేషన్ డీలర్ బండి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సన్వల్లి పెంటయ్య అన్నారు. బుధవారం గ్రామ రేషన్ దుకాణంలో గ్రామ ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన కార్యక్రమం ద్వారా నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ఎంతో హా ర్షదాయకమన్నారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాలే సన్నబియాన్ని తినే వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రతి నీరు పేద కుటుంబం నేడు సన్న బియ్యం తినే సదవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించడం ప్రతి ఒక్కరు అదృష్టంగా భావించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి పేద కుటుంబానికి దగ్గరవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్ బండి. లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంటయ్య, నర్సింలు గౌడ్ సుండు చెన్నయ్య, ప్రవీణ్,రమేష్, పిచ్చ కుంట్ల సాయన్న,కావలి. బుచ్ఛయ్య, బి.మల్లయ్య, కారోబార్ శ్రీను, మహిళలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామికి వైభవంగా చక్రవరి తీర్ధప్రసాద గోష్ఠి
లోకల్ గైడ్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన వల్మీడి శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు గురువారం రాత్రి...
రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న కేంద్రం బిజెపి ప్రభుత్వం 
పెంచిన గ్యాస్ ధర పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలి..
ఏప్రిల్ 11న థియేట‌ర్‌ల‌లో 'ప్రేమకు జై' 
అందుకే మరో పెళ్లి చేసుకోవడం లేదు: రేణు దేశాయ్
17న జేఈఈ మెయిన్‌ ఫలితాలు 
రాజస్థాన్‌పై టైటాన్స్ భారీ విజయం