కట్ర్యాల లో అగ్ని ప్రమాదం
సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ, వర్ధన్నపేట ప్రతినిధి: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో శనివారం రాత్రి పది గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. గ్రామంలోని చేవ్వల్ల కొమురెల్లికి సంబంధించిన 250 గడ్డిమోపులతో కూడిన గడ్డివాము అగ్ని ప్రమాదానికి గురైనది. రాత్రి సమయము కావడంతో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురైనారు. గ్రామస్తుల ఫోనుతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినారు. అగ్నిమాపక సిబ్బందితో, వర్దన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు మహ్మద్ అక్బర్ గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Mar 2025 17:38:55
లోకల్ గైడ్ ,వికారాబాద్: సోమవారం కల్లెక్టరేట్ సమావేశము హాలు నందు ఏర్పాటు చేసిన ప్రజా వాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 144...
Comment List