శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న మంత్రి పొంగులేటి దంపతులు
By Ram Reddy
On
లోకల్ గైడ్:
ఖమ్మం : శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాధురి దంపతులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. మంత్రి దంపతులకు ఆలయ రాజగోపురం వద్ద అర్చకులు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివార్ల ఫొటోను అందజేశారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
10 Apr 2025 16:08:23
లోకల్ గైడ్, మహబూబాబాద్ నల్లు సుధాకర్ రెడ్డి రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ భిన్న సంస్కృతులు ,మతాలు, కులాలు, జాతులను భాషలను ఒక తాటిపైకి...
Comment List