తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలి: మాజీ సీఎం కేసీఆర్
By Ram Reddy
On
లోకల్ గైడ్,హైదరాబాద్ :
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు గరళకంఠుని దీవెనలు ఉండాలని ప్రార్థించారు.పవిత్ర శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాస దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకతను సంతరించుకుందని కేసీఆర్ అన్నారు. దేశ వ్యాప్తంగా శివాలయాలు, భక్తుల శివనామస్మరణతో మారుమోగుతాయని అన్నారు. గరళాన్ని తన కంఠంలో దాసుకుని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమా శంకరుని కరుణాకటాక్షాలు తెలంగాణ ప్రజలకుండాలని ఆకాంక్షించారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 15:32:12
లోకల్ గైడ్ తెలంగాణ:చిల్పూర్ మండల కేంద్రంలోని చెల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి,...
Comment List