విద్యార్థిని శ్రీ చైతన్యను అభినందించిన: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

విద్యార్థిని శ్రీ చైతన్యను అభినందించిన: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

లోకల్ గైడ్ తెలంగాణ ప్రతినిధి :

జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీ నారాయణపురం గ్రామానికి చెందిన, విద్యార్థిని గూడా శ్రీ చైతన్య ఇటీవల ఖమ్మం పట్టణంలో జరిగిన, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొని, బంగారు పతకం సాధించగా, పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి   క్యాంపు కార్యాలయంలో, విద్యార్థిని శ్రీ చైతన్యను శాలువా కప్పి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. కరాటే శరీర దృఢత్వానికి, స్వీయ రక్షణకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జిగ కొమురయ్య, విద్యార్థిని తండ్రి గూడా రవీందర్, తదితరులున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News