రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోడపత్రికలు విడుదల చేసిన కలెక్టర్ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోడపత్రికలు విడుదల చేసిన కలెక్టర్ 

భద్రాది కొత్తగూడెం బ్యూరో,లోకల్ గైడ్, తెలంగాణ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు "ఆర్థిక అక్షరాస్యత - మహిళా సాధికారత" పై ఫిబ్రవరి 24 నుండి 28 వ తేది వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారిచే ప్రచురించబడిన గోడ పత్రికలను జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఆర్థిక అక్షరాస్యత సమాజంలో ప్రతి ఒక్కరికీ అవసరమని ముఖ్యంగా మహిళలు ఆర్థిక వ్యవహారాల్లో అవగాహన కలిగి ఉండడం ద్వారా త్వరితగతిన ఆర్థిక ప్రగతి సాధించవచ్చు అన్నారు.మహిళల కొరకు ఆర్థిక ప్రణాళిక, పొదుపు మరియు నష్ట నివారణ చర్యలు, ఆర్థిక పరిపుష్టికి రుణాలు పొందడం తదితర అంశాలపై గృహిణులు, ఉద్యోగినులు, స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు, కళాశాల విద్యార్థినులకు అన్ని బ్యాంక్ శాఖలు, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు బ్యాంక్ అధికారులు విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామిరెడ్డి, ఐడిఓసి మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
లోకల్ గైడ్ తెలంగాణ:చిల్పూర్ మండల కేంద్రంలోని చెల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి,...
సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి....
మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...