పాతకోట లోని సమీకృత కూరగాయల మార్కెట్ పేదలకు నిలయంగా మారిన
సమీకృత కూరగాయల మార్కెట్లను
పాత వ్యవసాయ మార్కెట్ లోని ఏర్పాటు చేయాలి,
అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్.
లోకల్ గైడ్ :
అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ,కోట్లు పెట్టి బిల్డింగులు కడుతున్నారు. మూలకు పెడుతున్నారు. కానీ ఉపయోగం లోకి తేవడం లేదు. ఎవరికి లాభం? కానీ కాంట్రాక్టుల బతకడం కోసం మళ్ళీ బిల్డింగులు కడుతున్నారు. పాతకోట లోని కందకం లో ఎంతో ప్రతిష్టాత్మకంగా 14 ఫైనాన్స్ తో కట్టిన కూరగాయల మార్కెట్ నిరుపయోగంగా ఉంది. దాన్ని వినియోగం లోకి తేవాలనీ ప్రజలకు కోరుతున్నారు. లేకపోతే డబుల్ బెడ్ రూమ్ ను కట్టి ప్రజలకు అప్పగించండి అంటూ డిమాండ్ చేస్తున్న ప్రజలు. అలాగే పాత వ్యవసాయ మార్కెట్లో కట్టిన సమీకృత మార్కెట్ బిల్డింగును తక్కువ ధరలకు ఇచ్చి వినియోగం లోకి తేవాలని, ప్రజల కోరిక మేరకు శనివారం వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదిక సభ్యులు వనపర్తి కలెక్టర్ ని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్,ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ గంధం నాగరాజు, సిపిఎం నాయకులు మార్టిన్, గౌని కాడి యాదయ్య, బొడ్డుపల్లి సతీష్ శివకుమార్, కృష్ణయ్య, శ్రీనివాసులు, సురేష్, రాముడు, భాష తదితరులు పాల్గొన్నారు.
Comment List