సీఎంఆర్ఎఫ్ స్కీమ్ పేద ప్రజలకు వరం లాంటిది.
సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
లోకల్ గైడ్ :
సీఎం రిలీఫ్ ఫండ్ స్కీం పేద ప్రజలకు వరం లాంటిది అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుప్తా సుఖేందర్రెడ్డి వెల్లడించారు.ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాకాల రాములమ్మ కు 40,000 (నలభై వేల) రూపాయలు,పెండెంల మీనయ్య కోడలు సంధ్యకు 33,000 (ముప్పై మూడు వేల) రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ సీ. ఎం రిలీఫ్ ఫండ్ స్కీం పెద ప్రజలకు వరమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం ఆర్ ఎఫ్ పథకాన్ని చాలా అద్భుతంగా అమలు చేస్తోందని ఆయన చెప్పారు .ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వాళ్లకు బుద్ధుడు, సోషల్ మీడియా ఇన్చార్జ్ పట్ల జనార్ధన్ ,,ఉత్తమ నాయకులు జన పాల శ్రీను, యువ నాయకులు పాకాల దినేష్ ,మర్రి రమేష్, పూజాల నరేష్ ,పొలగోని శంకర్, పాకాల బాలరాజు, పాకాల చిన్న బుచ్చయ్య, పాకాల మల్లయ్య, గంగాపురం వెంకన్న ,పాకాల రమేష్, వసుకుల స్వామి తదితరులు పాల్గొన్నారు..
Comment List