కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి..
By Ram Reddy
On
లోకల్ గైడ్,పాలకుర్తి:
పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి లేకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంపై గ్రీవెన్స్ సెల్ లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కు పాలకుర్తి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్,మాజీ జడ్పీటీసీ పుస్కురి శ్రీనివాసరావు,జిల్లా నాయకులు పల్లా సుందర్ రాం రెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు.క్యాంపు కార్యాలయంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ సమావేశాన్ని నిర్వహించారని,అలాగే పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమైన చర్యని,నిబంధనలకు విరుద్ధమే కాకుండా పరిపాలనా వ్యవస్థ పారదర్శకతను దెబ్బతీసే విధంగా ఉందని,కావున చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Mar 2025 11:54:28
లోకల్ గైడ్ తెలంగాణ,ఖమ్మం :
చి.కడవెండి శ్రీ చక్రధర్ - చి.ల.సౌ.హాసిక ల వివాహ మహోత్సవం సందర్భంగా మంగళవారం రోజు డాక్టర్ అన్నం సేవా ఫౌండేషన్
Comment List