ఉత్త‌రాది భాషల‌ను నాశ‌నం చేశాయి: సీఎం స్టాలిన్

ఉత్త‌రాది భాషల‌ను నాశ‌నం చేశాయి: సీఎం స్టాలిన్

లోకల్ గైడ్:
హిందీ భాష‌ను ఎట్టి ప‌రిస్థితిలో త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయ‌బోమ‌ని త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు. త‌మిళ భాష‌ను,త‌మిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తాన‌న్నారు. హిందీ-సంస్కృతం ఆధిప‌త్యం వ‌ల్ల‌..ఉత్త‌రాదికి చెందిన 25 ప్రాచీన భాష‌లు నాశ‌న‌మైన‌ట్లు ఆరోపించారు.చెన్నై:హిందీ భాష‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు త‌న పోరాటాన్ని ఉదృతం చేసింది.ఆ భాష‌ను ఎట్టి ప‌రిస్థితిలో అమ‌లు చేయ‌బోమ‌ని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ స్ప‌ష్టం చేశారు.త‌మిళ భాష‌ను, త‌మిళ సంస్కృతిని కాపాడుకునేందుకు పోరాటం చేస్తాన‌న్నారు.హిందీ భాష‌ను క‌చ్చితంగా నేర్చుకోవాల‌న్న నిబంధ‌న‌ను వ్య‌తిరేకిస్తున్నామ‌ని,హిందీ భాష ఓ మాస్క్ అయితే,సంస్కృతం ఓ క‌నిపించ‌ని ముఖం అన్నారు.పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు రాసిన లేఖ‌లో ఆయ‌న ఈ విష‌యాన్న తెలిపారు.మూడు భాషలు నేర్చుకోవాలని కేంద్ర స‌ర్కారు కొత్త‌గా నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాల‌సీ తెచ్చిన విష‌యం తెలిసిందే.అయితే కేంద్ర నిర్ణ‌యాన్ని డీఎంకే వ్య‌తిరేకిస్తున్న‌ది.బీహార్‌,యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాట్లాడే మిథిలీ,బ్ర‌జ్‌భాషా,బుందేల్‌ఖండ్‌,అవ‌ధి లాంటి స్థానిక భాష‌లు..హిందీ భాష ఆధిప‌త్యం వ‌ల్ల నాశ‌న‌మైన‌ట్లు స్టాలిన్ త‌న లేఖ‌లో తెలిపారు.హిందీ-సంస్కృత భాషల ఆధిప‌త్యం వ‌ల్ల ఉత్త‌రాదికి చెందిన సుమారు 25 ప్రాచీన భాష‌లు అంత‌రించిపోయిన‌ట్లు స్టాలిన్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.శ‌తాబ్ధ కాలం నాటి ద్ర‌విడ ఉద్య‌మం వ‌ల్ల‌..త‌మిళ భాష,సంస్కృతిని ర‌క్షించుకున‌ట్లు చెప్పారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
లోకల్ గైడ్ తెలంగాణ:చిల్పూర్ మండల కేంద్రంలోని చెల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మాజీ ఉప ముఖ్యమంత్రి,...
సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి....
మహిళా హక్కుల సారధి ఐద్వా పోరాటాలతోనే సాధికారత సాధ్యం. .
అన్నం సేవా ఫౌండేషన్ లో అన్నదాన కార్యక్రమం. 
సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కళాశాలలో విద్యార్థి మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి..
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇందిరమ్మ కమిటీ సభ్యులే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు...