కాయితి శంకర్ కు డాక్టరేట్ అవార్డు ప్రదానం
లోకల్ గైడ్: రాయికల్, ఏప్రిల్ 29: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టటానికి చెందిన కాయితి శంకర్ కు లండన్ లోని మెక్సికో టొలాసా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డును యూనివర్సిటీ అధికారులు ఆదివారం మహారాష్ట్ర నాసిక్ రాయల్ హోటల్ లో అందించి ఘనంగా సత్కరించారు కాయితి శంకర్ పాత్రికేయునిగా ,అంబేద్కర్ వాదిగా సమాజం లోని బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ ఉపాధి హామీ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం,కుల వివక్షలకు వ్యతిరేకంగా గత పది సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు చేస్తూ జగిత్యాల జిల్లా తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు చేసినందుకు నిరుపేద సమాజానికి సేవలు చేసినందుకు గాను ఈ అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు .కాయితి శంకర్ కు డాక్టరేట్ అవార్డు ప్రదానం చేయడం పట్ల సమతా సైనిక్ ధళ్ నాయకులు మెట్టు దాస్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి.లింగన్న మాల,సంజయ్ స్తూరే, ఉయ్యాల శోభన్,కోట శంకర్,నరేందర్, పల్లెరవి,దళిత ఉద్యోగ సంఘాల నాయకులు రాయికల్ అంబేద్కర్ సంఘం నాయకులు చెంగలి గంగాధర్,బాపురపు నర్సయ్య,గుర్రం రత్నాకర్ ,చింతకుంట సాయికుమార్,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు మ్యాదరి శ్రీహరి, ,నాయకులు కొండ్ర గంగాధర్, చెలిమెల మల్లేశం దామెర రాజయ్య ,బలిజ రాజారెడ్డి, చింతకుంట గంగాధర్,బొల్లం విజయ్ , ,అంబేద్కర్ సంఘాల రాష్ట్ర నాయకులు మొగురం రమేష్ ,నర్సాపురం రవీందర్, మార్వాడీ సుదర్శన్,బోయిని అశోక్,ప్రమోద్ మరియు రాయికల్ ప్రెస్ క్లబ్ సభ్యులు, అధ్యక్ష, కార్యదర్శి, ప్రెస్ క్లబ్ జేఎసి నాయకులు తదితరులు అభినందించారు ఈ అవార్డు అందించిన ,ఇండియా కో ఆర్డినేటర్ రమేష్ బిగాన్ కోర్ డా.కట్ట బొమ్మన్ గారికి కాయితి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comment List