అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి

మామిడి తోటలను, వరి ధాన్యం కల్లాలను పరిశీలించిన ఎమ్మెల్యే.

అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలి

లోకల్ గైడ్:  అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను  ప్రభుత్వం ఆదుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సాయంకాలం అకాల వర్షం కారణంగా మామిడి తోటలు, వరి పంటలు, వడ్లు దెబ్బతిన్నాయి. వివిధ గ్రామాలలో మూగ జీవాలు పిడుగుల కు మరణించాయి. సోమవారం గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో అకాల వర్షం కారణంగా రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరగడంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి వరి కల్లాలను, రైతుల మామిడి తోటకు వెళ్లి తోటలో పరిశీలించారు. అనంతరం ధరూర్ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ఎమ్మెల్యే సందర్శించి ధాన్యం ను పరిశీలించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రం దగ్గర రైతులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగుల సమస్యలతో రైతుల ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి రైతులకు అలాంటి ఇబ్బంది లేకుండా గన్ని బ్యాగులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా గద్వాల నియోజకవర్గంలోని పలు గ్రామాలలో రైతులు వరి ధాన్యమును వర్షానికి తడి పోవడం జరిగింది. సంవత్సరం నుండి వేసిన మామిడి తోటల్లో మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. దాదాపుగా 25 లక్షల వరకు రైతులకు నష్టం రావడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి  అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలన్నారు. ఏ గ్రామాలలో రైతులు నష్టపోయిన సంబంధిత అధికారులతో పూర్తి నివేదికను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా రైతులు మామిడి తోటలు పండించడం జరుగు తుందన్నారు. సరిగ్గా మామిడి తోట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట మొత్తం నాశనం కావడం జరిగిందన్నారు. ప్రభుత్వం మామిడి తోట రైతులను  ఆదుకోవాలని, వారికి అండగా నిలవాలని కోరారు. అదే విధంగా గద్వాల నియోజకవర్గం ఉరుములు మెరుపులు అకాల వర్షం కారణంగా పలు గ్రామాలలో మూగ జీవాలు, ఆవులు బర్రెలు, ఎద్దులు మేకలు గొర్రెలు మరణించడం జరిగిందన్నారు. ప్రభుత్వం వాటికి ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరారు. ఎవరు అదైర్య పడొద్దని, ప్రభుత్వం తరఫున నష్టపోయిన వారికి నష్టపరిహారం వచ్చే విధంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ప్రతి ఒక్క రైతును   ఆదుకుంటానని ఎమ్మెల్యే  భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ  జెడ్పిటిసి రాజశేఖర్, మాజీ వైస్ ఎంపీపీ భర్త రామకృష్ణ నాయుడు, నాయకులు ఉరుకుందు, శేఖర్ రెడ్డి, రాజేష్, చంద్రశేఖర్, డి.వై రామన్న, శేఖర్ రెడ్డి, తిమ్మారెడ్డి, గోపి , పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News