మనం కులమతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలి.
ఉగ్రదాడి ఘటనపై హీరో అజిత్ కుమార్ స్పందించారు.
లోకల్ గైడ్ :
కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలి. ఉగ్రదాడి ఘటనపై హీరో అజిత్ కుమార్ స్పందించారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తాజాగా స్పందించారు.
Ajith Kumar | పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్స్పందించారు. పర్యాటకులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాలను సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘనంగా ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పద్మభూషణ్ అవార్డును స్వీకరించారు.
ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజలంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ, కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో పెహల్గామ్లాంటి దారుణ ఘటనలు మరల చోటుచేసుకోకూడదని ఆకాంక్షించారు.
అలాగే, పద్మ అవార్డుల కార్యక్రమంలో తాను సాయుధ దళాలను కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారి త్యాగాలకు నమనాలు అర్పించారు. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి వారు చేసే త్యాగాలే కారణమన్నారు.
Comment List