మూగ జీవాలను సజీవ దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి
సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి.
లోకల్ గైడ్ తెలంగాణ:
ఖిలావరంగల్ మండలంలోని ఖిలా వరంగల్ గ్రౌండ్ సమీపంలో ఉన్న గొర్రెల శాలను గురువారం రాత్రి దుండగులు కాల్చివేసిన స్థలాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి పరిశీలించారు. అనంతరం మేకల రవి మాట్లాడుతూ మూగజీవాలైన సుమారు 400 గొర్రెలను సజీవ దహనం చేయడం ఘోరమైన చర్యగా పేర్కొన్నారు. బాధిత కుటుంబం సుమారు 50 లక్షల వరకు నష్టపోవడం జరిగిందని తెలిపారు. దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు.బాధిత కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం 30 లక్షల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని లేకుంటే ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉందని, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పనాస ప్రసాద్ సిపిఐ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి, సంగి ఎలేందర్ దళిత హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా అధ్యక్షులు,రాచర్ల రాజేందర్ డి హెచ్ పి ఎస్ ఖిలా వరంగల్ మండల కార్యదర్శి, నాయకులు మంద నవీన్,ఠాకూర్,సునీత తదితరులు పాల్గొన్నారు.
Comment List