ఎస్సీ వర్గీకరణ తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఈదునూరి వెంకటేశ్వర్లు మాదిగ.
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ,నెక్కొండ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుని నోటిఫికేషన్లను ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు ఇదినూరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం నెక్కొండ తహసిల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేపట్టాలని, మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే ఈ నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బిర్రు కమలహాసన్ మాదిగ, మండల సలహాదారులు కందిక వీరస్వామి మాదిగ, విద్యార్థి సంఘ నాయకులు ఇదినూరి సురేష్ మాదిగ, స్వామి రామచందర్, డెక్క అజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 09:13:07
భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్
Comment List