గ్రూప్-2 పరీక్షలో 25వ ర్యాంక్ సాధించిన ఎస్.ఐ. శివను సన్మానించిన ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS
By Ram Reddy
On
లోకల్ గైడ్ తెలంగాణ,మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:
గ్రూప్-2 పరీక్షలో ప్రతిభ చూపించి 25వ ర్యాంక్ సాధించిన ఎస్.ఐ. శివను జిల్లా పోలీస్ అధికారి సుధీర్ రాంనాధ్ కేకన్, IPS అభినందించి, ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్రమశిక్షణ, కఠిన సాధన, పట్టుదల ఉంటే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలిపారు. మహబూబాబాద్ టౌన్ ఎస్సై శివ తన విధులను నిర్వహిస్తూ చదువుపై ఆసక్తి కనబరచి, ఉన్నత ర్యాంక్ సాధించడం ఇతర పోలీస్ అధికారులకు ప్రేరణగా నిలుస్తుందని ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, డీసీఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ,టౌన్ సీఐ దేవేందర్, ఆర్.ఐలు నాగేశ్వర్రావు, అనిల్, పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Mar 2025 09:13:07
భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక అధికారి కృష్ణ భాస్కర్
Comment List