జలమండలి కీలక నిర్ణయం..ఇక నో టెన్షన్..
లోకల్ గైడ్:
హైదరాబాద్ నగరంలో సమ్మర్ టెన్షన్ మెుదలైంది.ఎండా కాలం వచ్చిందంటే చాలా ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడుతుంది.గతేడాది ట్యాంకర్లతో కొందరు నీటికి తెప్పించుకున్నారు.ఈ ఏడాది కూడా పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.ఇప్పుడే ట్యాంకర్లతో నీటిని తెప్పించుకున్నారు. కొందరు అధిక డబ్బులు చెల్లించి మరీ ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.అయినా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఉంటుంది.బస్తీల్లో అయితే నీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఉస్మాన్సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి నీటిని తరలించేందుకు ప్రస్తుతం ఉన్న కాండ్యూట్కు సమాంతరంగా మరో పైపులైను ఏర్పాటుకు రెడీ అయ్యారు.హైదరాబాద్ నగరంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉస్మాన్సాగర్ నుంచి అదనంగా నీటిని తీసుకునేందుకు వీలుగా సమాంతరంగా కొత్త పైపులైన్ను ప్రతిపాదించారు.దాదాపు 14.5 కిలోమీటర్ల పొడవున కొత్త పైపులైన్ వేయడానికి జలమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.సుమారు వందేళ్ల క్రితం ఉస్మాన్సాగర్ నుంచి రోజుకు 25 ఎంజీడీల నీటిని తరలించే సామర్థ్యంతో పాత కాండ్యూట్ను నిర్మించారు.అప్పటి నుంచి నగర అవసరాలకు కాండ్యూట్ ద్వారా నీటిని తరలిస్తున్నారు.ముందుగా ఆసిఫ్నగర్ ఫిల్టర్ బెడ్స్కు నీరు చేరుతుంది.అక్కడ జలాలు ఫిల్టర్ చేసి ఆ తర్వాత నగరంలో వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
Comment List