టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు
లోకల్ గైడ్ తెలంగాణ,హనుమకొండ జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం రోజు నిర్వహించిన 81వ పాలకవర్గ సమావేశంలో టీజీ క్యాబ్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఆర్థిక లావాదేవీలపై,టర్నోవర్స్, జిల్లాలోని డిసిసిబి బ్యాంకుల పని తీరు పురోగతి పై, ఐటి రంగం, నెట్ వర్క్ పై, డిపాజిట్స్ ఎడ్యుకేషనల్ అవర్నెస్, ఆర్బీఐ, నాబార్డ్ సర్కులర్ల అమలుపై,వ్యవసాయ రుణాలు,రైతు రుణ మాఫీపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నూతనంగా నియమితులైన ఆర్సిఎస్ (రిజిస్ట్రార్ ఆఫ్ కో - ఆపరేటివ్ సోసైటీస్) సురేంద్ర మోహన్ ఐఏఎస్ ని రవీందర్ రావు బోర్డు డైరక్టర్లతో కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సమావేశంలో డైరక్టర్లు, కుంభం శ్రీనివాస్ రెడ్డి, అడ్డి బోజా రెడ్డి, మామిల్లపల్లి విష్ణు వర్ధన్ రెడ్డి, దొండపాటి వేంకటేశ్వర రావు,కుంట రమేష్ రెడ్డి,ప్రొఫెషనల్ డైరక్టర్లు,శ్రీనివాసులు,మెహనయ్య, ఆర్సిఎస్ సురేంద్ర మోహన్ ఐఏఎస్, ఆడిషనల్ రిజిస్ట్రార్ శ్రీనివాస రావు,నాబార్డ్ సిజిఏం ఉదయ్ భాస్కర్ ,టేస్కాబ్ సీజిఏం జ్యోతి , జిఏంలు సురేఖ,సుజాత,లత , బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
Comment List