ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం

లోకల్ గైడ్ :
జడ్చర్ల మండలంలో గల జడ్పీహెచ్ఎస్ ఆలూరు ఉన్నత పాఠశాల ఎన్జీసి ఆధ్వర్యంలో ఈరోజు ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆలూరు గ్రామంలో వీధి వీధి ర్యాలీగా తిరుగుతూ అడవుల యొక్క ఆవశ్యకతను ఆలూరు గ్రామ ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులు  చేయడమైనది. ఈ సందర్భంగా గ్రామ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాలఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు షరీఫ్ మాట్లాడుతూ అడవుల వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి స్పష్టంగా వివరించారు. అడవుల శాతాన్ని పెంచుకోవడానికి ప్రతి ఒక్క రు కనీసం ఒక మొక్కను పెంచి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్జీసీ ఇంచార్జ్ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి  మాట్లాడుతూ మొక్కలు మనకు ఆక్సిజన్, ఆహారం వర్షం పర్యావరణ సమతుల్యత వంటి ముఖ్యమైన పనులు నిర్వహిస్తాయని వీటిని పెంచుకుంటేనే మన భవిష్యత్తు బాగుంటుందని వివరించారు. తెలుగు ఉపాధ్యాయులు అలీం మాట్లాడుతూ గ్రామాల కంటే అడవులే చాలా ప్రాధాన్యతగలవని ఈ విషయాన్ని మనం గమనించి అడవుల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు హరినాథ్, సోమలా నాయక్, సంధ్య, హైమావతి, నిర్మల, మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ  అద్దంకి దయాకర్ పై చితల పాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
లోకల్ గైడ్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిపై అసత్య వ్యాఖ్యలు చేసిన అద్దంకి దయాకర్ పై  చింతలపాలెం పోలీస్ స్టేషన్ నందు   బిజెపి చింతలపాలెం మండల...
తాళ్ల రాంపూర్ గీత కార్మికులపై సాంఘిక బహిష్కరణ ఎత్తివేయాలి
పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ 
పాఠశాలలోని ఖగోళ విజ్ఞాన ప్రయోగశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి 'భూ భారతి' చట్టం దోహదం 
INTSO లో విజయం సాధించిన శ్రీ చైతన్య విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 
బదిలీపై వెళ్తున్న జిల్లా జడ్జికి వీడ్కోలు పలికిన కలెక్టర్