ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి గంభీర్ ఆసక్తి...

ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి గంభీర్ ఆసక్తి...

లోక‌ల్ గైడ్: 
 జూన్‌ నుంచి ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌.. ప్రధాన జట్టు కంటే ముందే ఆ దేశానికి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నాడు. ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా గడిపే సమయంలో భారత ‘ఏ’ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లనుండగా.. ఆ జట్టుతో కలిసి గంభీర్‌ వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ముందే వెళ్లడం వల్ల రిజర్వ్‌ బెంచ్‌ను మరింత బలోపేతం చేసుకోవచ్చునని, ఎవరి సత్తా ఏమిటో తెలుసుకునేందుకు ఇదొక చక్కటి అవకాశమని గంభీర్‌ అనుకుంటున్నాడు.ఇదే విషయాన్ని అతడు ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన వెంటనే బీసీసీఐతో జరిగిన సమావేశంలో చర్చించినట్టు బోర్డు ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ గంభీర్‌ గనక భారత ‘ఏ’ జట్టుతో వెళ్తే అలా వెళ్లిన తొలి హెడ్‌కోచ్‌గా నిలుస్తాడు. రవిశాస్త్రి హెడ్‌కోచ్‌గా ఉన్నప్పుడు భారత ‘ఏ’ టూర్లకు రాహుల్‌ ద్రవిడ్‌ వెంట వెళ్లేవాడు. ద్రవిడ్‌ కోచ్‌ అయ్యాక ఆ బాధ్యతలను వీవీఎస్‌ లక్ష్మణ్‌ చూసుకున్నాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సదస్సు
లోకల్ గైడ్,రంగారెడ్డి:గౌరవ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గారి ఆద్వర్యంలో సదరం నుండి యూడిఐడి(UDID)కి మారుతున్న సందర్భం"గా దివ్యాంగుల సంఘ ప్రతినిధులకు , సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించడం...
టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో మహిళ, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీమ్స్
పూరీ తీరాన ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించిన భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్
జీవ బొగ్గు (బయోచార్)  వలన కలిగే ప్రయోజనాలపై రైతులకు  అవగాహన కల్పించాలి.
కిడ్నీ రోగులకు నమ్మకమైన సేవలు అందిస్తున్నాం డాక్టర్ నాయక్
వాకింగ్ బూట్‌తో రాహుల్ ద్రావిడ్..
టీడబ్ల్యూజేఎఫ్ చేయూత