కీరవాణి కన్సర్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న : రాజమౌళి
లోకల్ గైడ్:
తన అన్నయ్య కీరవాణి కన్సర్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి.ఆస్కార్ అవార్డు గ్రహీత,ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి లైవ్ కన్సర్ట్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.‘నా టూర్ ఎం.ఎం.కె'పేరిట ఈ కన్సర్ట్ చేయనుండగా..మార్చి 22న సాయంత్రం 7గంటలకు హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.అయితే ఈ వేడుకను సక్సెస్ చేయాలని కోరుతూ ఆయన తమ్ముడు దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఒక వీడియో విడుదల చేశారు.ఈ వీడియోలో అభిమానుల నుంచి సపోర్ట్ను కోరారు.మార్చి 22 కోసం నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఆరోజు అన్నయ్య ఎం.ఎం.కీరవాణి కన్సర్ట్ ఉంది.ఈ కన్సర్ట్లో నా సినిమాలోని పాటలతో పాటు ఆయన సంగీతం అందించిన పాటలను పాడనున్నారు.నా డిమాండ్ ఏంటి అంటే ఆయన ఒ.ఎస్.టి (ఒరిజినల్ సౌండ్ ట్రాక్)లూ ఉండాలనేది నా డిమాండ్.ఎందుకంటే ఆయన రీ రికార్డింగ్ అద్భుతంగా ఉంటుంది. ఆయన పాటలు ఎంత ఫేమసో అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు కూడా అంతే ఫేమస్.ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లను,ఒ.ఎస్.టి లను లైవ్లో ప్లే చేయాలని కోరుకుంటున్నా అంటూ రాజమౌళి చెప్పుకోచ్చాడు.
Comment List