మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన గౌడసంఘాల నేతలు 

మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన గౌడసంఘాల నేతలు 

లోకల్ గైడ్, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని మినిస్టర్ క్వార్టర్లతో శనివారం నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన గౌడ సంఘాల నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఇతర గౌడ సంఘాల నేతలు.పలు అంశాల పై మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిన గౌడ సంఘాల నేతలు.తెలంగాణ గౌడ సంఘాల పక్షాన గౌడ ప్రముఖులు మాజీ శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ గారు, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు నీరా కేకు సంబంధించిన ఇష్యూ , సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి సంబంధించిన అంశం, గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన మూడు అంశాలను , రాజకీయ ప్రాధాన్యతకు సంబంధించిన అంశాలను నా దృష్టికి తేవడం జరిగింది. నిన్ననే నేను ,పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాము.  భవన నిర్మాణానికి సంబంధించి ప్రముఖులందరిని కలుపుకొని మార్చ్ తర్వాత భవన నిర్మాణానికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి స్థలం విషయంలో గతంలో చూసిన స్థలం కానీ వేరే స్థలాన్ని చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు మా ఇద్దరికే అప్పగించారు. నీరాకేఫ్ సంబంధించి టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో పాటు ఎండి ప్రకాష్ రెడ్డి గారితో వారి కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశాం. బీసీ కార్పొరేషన్ ,గీతా పారిశ్రామిక కార్పొరేషన్ ఎండీ సమావేశంలో పాల్గొన్నారు. ఆనాడు శ్రీనివాస్ గౌడ్ ఒక ఆలోచన చేసి నీరాకేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఇప్పుడు దానిపై రాజకీయం చేయడం అనవసరం. మేము కుల ప్రతినిధులుగా కులానికి సంబంధించిన విషయంలో బాధ్యతగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు నీరాకేఫ్ కట్టే సందర్భంలో  గీతా పారిశ్రామిక కార్పొరేషన్ కు దాని హక్కులు అప్పగిస్తే ఈరోజు ఇబ్బందులు ఉండకపోయేది. సగం సగం చేయడం వల్ల ఈరోజు ఇబ్బందులు ఉన్నాయి. టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,టూరిజం ఎండీ నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినది టర్మ్ అండ్ కండిషన్స్ చేసుకొని నీరాకేఫ్ ను పూర్తి స్థాయిలో గీత పారిశ్రామిక కార్పొరేషన్ కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నాం.గౌడ పెద్దలు గమనించండి నేను , కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి మేము మీ ప్రతినిధులం. మీకు ఏ సమస్య ఉన్న మా దృష్టికి తీసుకోండి. ఎవరు ఏం చేశారు అనేది చర్చ అవసరం లేదు. గతంలో చేసిన వారిని గౌరవించుకుంటూనే బాధ్యత గల వ్యక్తులుగా కులానికి సేవ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. నీరా కేఫ్ కి సంబంధించి ఎవరెన్ని సమావేశాలు పెట్టుకున్నా భవిష్యత్తులో ఇది గీత పారిశ్రామిక కార్పొరేషన్ సంస్థకు అందుతుంది. దీనిలో అందరూ మనకు సంబంధించిన వారే వ్యవహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు