ఎంపీ వద్దిరాజు నీలాద్రీశ్వర స్వామి ఆలయ సందర్శన

ఎంపీ వద్దిరాజు నీలాద్రీశ్వర స్వామి ఆలయ సందర్శన

లోకల్ గైడ్, ఖమ్మం: మహా శివరాత్రి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నీలాద్రీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్నపాలెం సమీపాన కొలువైన స్వయంభు నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయాన్ని బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ పుణ్య దంపతులు హోమంలో పాల్గొని, శివలింగాన్ని పూలమాలలు, పంచామృతాలతో అభిషేకించి,గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారిని కండువాలతో గౌరవించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఆశీర్వచనాలు పలికారు.ఎంపీ రవిచంద్రతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుగ్గిదేవర వెంకట్ లాల్, యూత్ లీడర్స్ సుంకర చిరంజీవి,ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు