డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన
టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి,
లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా, ఐబి నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత , రాజకీయ నేత, సంఘసంస్కర్త, అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం కృషి చేశాడు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కేంద్ర శాఖామంత్రిగా నిర్వహించడం తోపాటు రాజ్యాంగ శిల్పి, అని పిలవబడ్డాడు అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రూపొందించడం జరిగిందని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాటు అనంత కిషన్, చేర్యాల ఆంజనేయులు, సి డి సి చైర్మన్ రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయక్, ఏఎంసీ కుమార్, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Comment List