ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి 

ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన

రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, 

డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి

లోకల్ గైడ్ న్యూస్ :

రైతులు పండించిన వరి ధాన్యం పంటను ప్రభుత్వ  కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని ప్రభుత్వం ఇస్తున్న క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లబ్ది పొందాలని వనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.సోమవారం ఉదయం శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, డి.సి.సి.బి చైర్మన్ విష్ణు వర్ధన్ రెడ్డి తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించారు. రైతులు పండించిన  ప్రతి వరి ధాన్యపు గింజను ప్రభుత్వం మద్దతు ధర తో కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాలుకు రూ.500 మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని అందువల్ల రైతులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, మాజీ ఎంపిపి కిచ్చా రెడ్డి, మాజీ ఎంపిపి శంకర్ నాయక్, రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .