నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..

ఒక్కో బుక్‌పై 60 శాతం డిస్కౌంట్‌!

నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..

లోక‌ల్ గైడ్:

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు యూనివర్సిటీ, ఏప్రిల్‌ 7: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణల విభాగం ప్రచురించిన గ్రంథాలను ప్రత్యేక రాయితీతో విక్రయించడానికి పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నాంపల్లి ప్రాంగణంలో గల పుస్తక విక్రయ కేంద్రంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇది తెరిచి ఉంటుందని వెల్లడించారు.ఈ పుస్తక ప్రదర్శలో ప్రతి పుస్తకంపై 60 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య కోట్ల హనుమంతరావు తెలిపారు. ప్రాచీన గ్రంథాలు, సాహిత్యం, నిఘంటువులు, సంగీత, నృత్య గ్రంథాలు, భారత, భాగవతాలు, ప్రబంధాలు, పురాణాలు, పంచకావ్యాలు, ఇతిహాసాలు, చరిత్ర గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు తగ్గింపు ధరలలో విక్రయానికి సిద్ధంగా ఉంటాయని, సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు, భాషా ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యూవత క్రీడారంగంలో రణ్ణించాలి యూవత క్రీడారంగంలో రణ్ణించాలి
లోకల్ గైడ్: మండలపరిది లోని లేమామిడి గ్రామం లో ఉమ్మడి మహబూబ్నగర్ గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామం మాజీ సర్పంచ్ శ్రీశైలం గౌడ్ ప్రారంభిచారు. వేసవి...
సంతాపూర్ గ్రామం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన బీజేపీ నాయకులు కరెడ్ల నరేందర్ రెడ్డి
భారత రాజ్యాంగమే దేశానికి ప్రజలకు రక్ష 
అంబేద్కర్ జయంతి వేడుకల్లో సంబు ప్రభాకర్
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అంబేద్కర్ కు నివాళులర్పించిన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వా జయంతి సందర్భంగా నివాళులర్పించిన 
పదవీవిరమణ పొందిన హోమ్ గార్డ్ ని ఘనంగా సన్మానించిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ .