జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను  త్వరగా పూర్తి చేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

జిల్లా పరిధిలోని జాతీయ రహదారుల నిర్మాణ పనులను  త్వరగా పూర్తి చేయాలి

లోకల్ గైడ్ తెలంగాణ:

సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి 765డీజీ పరిధిలో జిల్లాకు సంబంధించి నిర్మాణంలో ఉన్న రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని  సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశించారు. శనివారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సిద్దిపేట- ఎల్కతుర్తి మార్గంలో జాతీయ రహదారి నిర్మాణ పనులపై  జాతీయ రహదారుల శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట- ఎల్కతుర్తి  వరకు 63.64 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణ ప్రాజెక్టు ఉండగా హనుమకొండ జిల్లా పరిధిలో  ఉన్న 17.5 కిలోమీటర్ల లో ఇప్పటివరకు 16.5 కిలోమీటర్ల  రహదారి నిర్మాణం పూర్తయిందని జాతీయ రహదారుల శాఖ అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. ఎల్కతుర్తి, ముల్కనూర్  పరిధిలో ఒక్క కిలోమీటర్ దూరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. జిల్లా పరిధిలో ఉన్న ఈ జాతీయ రహదారి నిర్మాణ పనులు మొత్తం మే నాటికి పూర్తవుతాయని  అధికారులు తెలుపగా ఏప్రిల్ 30 నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.  రహదారి వెంట ఇరువైపులా మొక్కలను నాటడంతో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.  ఏవైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జాతీయ రహదారుల శాఖ డీఈఈ మనోహర్, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, తహసీల్దార్  జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..
లోక‌ల్ గైడ్: జైపూర్‌ నుంచి ముంబైకి బయలుదేరిన 6E 5324 నెంబర్‌ ఇండిగో విమానం టాయిలెట్స్‌లో లభ్యమైన ఓ లేఖ తీవ్ర కలకలం రేపింది. విమానంలో బాంబుపెట్టామని...
రాబోయ్ మూడు గంటల్లో ఆ మూడు జిల్లాల్లో పిడుగుల వాన
అవ‌తార్‌ని మించి అట్లీ
టాస్‌ గెలిచిన కోల్‌కతా..
నాంపల్లిలో పుస్తక ప్రదర్శన..
ఆ ఒక్క సీన్ కోసమే రాజ‌మౌళి వంద కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాడా..!
 బెదిరిస్తే.. బెదురుతామా ఏందీ..?