మెల్లమాంభ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మెల్లమాంభ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న : ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

లోకల్ గైడ్, మిర్యాలగూడ :  

ప్రముఖ రచయిత్రి "శ్రీశ్రీ కుమ్మరి మొల్లమాంబ" 560వ జయంతి సందర్భంగా పట్టణంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీశ్రీ కుమ్మర మెల్లమాంభ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని, విగ్రహ ఆవిష్కరణ చేసి, పూల మాలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొట్ట మొదటి మహిళా రచయిత్రి మొల్లమాంబ అని, ఆమె రచించిన మొల్ల రామాయణం ఆరోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెంది, ఆమె మంచి కీర్తి గడించిందని, మొల్ల తన జీవితాంతం రచించిన కవితలు తెలుగు మాట్లాడే చోట, దేశవ్యాప్తంగా పాడబడతాయని, వారి సరళత మరియు తీవ్రమైన ఆధ్యాత్మిక ఉత్సాహం గత ఐదు వందల సంవత్సరాలుగా వాటిని ప్రజాదరణ పొందేలా చేశాయని, వారి సేవలను కొనియాడారు. వారి జీవన విధానం ఎంతో మందికి ఆదర్శం అని, వారి కీర్తిని రానున్న తరాలకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుమ్మరి సంఘం నాయకులు, కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి