పలు కుటుంబాలను పరామర్శించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

పలు కుటుంబాలను పరామర్శించిన ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి

కొణిజర్ల/ ఏన్కూరు,లోకల్ గైడ్:

 ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి మంగళవారం వైరా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,  కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ లతో కలిసి కొణిజర్లలో మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు సూరంపల్లి రామారావు, ఏన్కూరులో  కాంగ్రెస్ మండల అధ్యక్షులు స్వర్ణ రామారావు నివాసాలకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత కొణిజర్లలో కొనకంచి మోషే తల్లి రోజమ్మ ఇటీవల మృతి చెందగా.. ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఏన్కూరు మండలం జన్నారం గ్రామంలో గుత్తా వెంకటేశ్వరరావు తండ్రి మరణించగా.. వారి కుటుంబ సభ్యులను ఎంపీ రఘురాంరెడ్డి పరామర్శించి.. అండగా ఉంటామని అభయమిచ్చారు.ఈ కార్యక్రమంలో..: రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీను,, నాయకులు స్వర్ణ ప్రహ్లాద రావు, ముక్తి వెంకటేశ్వరరావు, నల్లమల శివకుమార్, కట్ల సత్యనారాయణ, మేకా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు కేసులు కోర్టులు ఉద్యమాలను అణిచివేయలేవు
లోకల్ గైడ్ జనగామ జిల్లా : సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి తప్పుడు కేసులు నిర్బంధాలతో ఉద్యమాలను అనచి వేయలేరని అమరుల త్యాగాలతో...
వాకర్స్ హోలీ సంబరాలు
మాజీ శాసనసభ్యులుఎడ్ల గోపయ్య సేవలు స్ఫూర్తిదాయకం..
పంట పొలాలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి.
గిరిజనుల హక్కుల సాధనకై మార్చి 29న 'చలో మానుకోట' ను  విజయవంతం చేయండి..
రాబిన్‌హుడ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి డేవిడ్ వార్న‌ర్.?
టీజీ క్యాబ్ 81వ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న మార్నెనీ రవీందర్ రావు