ఈవీఎం గోదాంను పరిశీలించిన  అదనపు కలెక్టర్  రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి

ఈవీఎం గోదాంను పరిశీలించిన  అదనపు కలెక్టర్  రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి

ములుగు,లోకల్ గైడ్ తెలంగాణ:

కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఈవీఎం గోదాములను గురువారం అదనపు కలెక్టర్  రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి  వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా  అదనపు కలెక్టర్  రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్  గోడౌన్ లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికను పంపిస్తున్నామని తెలిపారు. ఈవిఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్ల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవిఎం గదులను, అక్కడ భద్రత ఏర్పాట్లను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయ భాస్కర్,  వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి