టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో మహిళ, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీమ్స్
నల్లగొండ జిల్లా బ్యూరో .
లోకల్ గైడ్ తెలంగాణ.
జిల్లా ఎస్పి కె నరసింహ ఆదేశాల మేరకు గురువారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి టేకుమట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల నందు జిల్లా షీ టీం అధ్వర్యంలో విద్యార్థుల భద్రత, మహిళా భద్రత, చట్టాల అమలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా షీ టీం ఎస్సై నీలిమ మాట్లాడుతూ మహిళల, విద్యార్థుల రక్షణకు జిల్లా పోలీసు శాఖ కృషి చేసున్నదన్నారు. ఎస్పి ఆదేశాల ప్రకారం షీ టీం అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లు కలిగి ఉండాలని, గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని సూచించారు. పూర్వకాలం నుండి సమాజంలో స్త్రీ కి ప్రత్యేక స్థానం ఉన్నదని, మనకు జన్మని ఇచ్చినది ఒక స్త్రీ అనే విషయాన్ని గుర్తుంచుకుని స్త్రీ కి ప్రాముఖ్యత ఇవ్వాలని, గౌరవించాలని కోరారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. మహిళ, విద్యార్థుల భద్రతలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి అన్నారు. తోటి విద్యార్థులతో మంచిగా ప్రవర్తించాలని, కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు, గురువులకు, సొంత గ్రామానికి మంచి పేరు తేవాలని, ఆదర్శంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్నెట్ ద్వారా మంచిని నేర్చుకోవాలి కానీ సోషల్ మీడియా, ఇంటర్నెట్ కు బానిసలు కావద్దు అని చెప్పారు. ఆన్లైన్ పేయింగ్ గేమ్స్ అడవద్దని, సైబర్ మోసాల బారిన పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నదన్నారు.వేధింపులపై నిర్భయంగా పిర్యాదు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ సలీమ బేగం, రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రహిముద్దీన్, కానిస్టేబుల్ రవి, హోమ్ గార్డ్ మజీద్, పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి, గురులింగం, కృష్ణ నాగార్జున, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Comment List