మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ను మట్టికరిపిస్తాం

మహిళలను మోసం చేస్తే కాంగ్రెస్ ను మట్టికరిపిస్తాం

 

మహిళల ఆగ్రహాన్ని చవి చూడకముందే హామీలు అమలు చేయండి

హామీలపై ప్రకటన చేయకపోతే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులు పంపిస్తాం

మార్చి 8లోపు మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాల్సిందే

మహిళా లోకంతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి సర్కారు

తప్పుడు హామీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కవిత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 వేల పోస్టు కార్డులు పంపిన ఎమ్మెల్సీ కవిత
లోకల్ గైడ్ హైదరాబాద్ ప్రతినిధి:
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా లోకాన్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీని మట్టికరిపిస్తామని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8వ తేదీలోగా మహిళలకు నెలకు రూ 2500 ఇవ్వడంతో పాటు అన్ని హామీలపై కార్యాచరణ ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.  మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి సోమవారం నాడు ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 10 వేల పోస్టు కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత విలేకరులతో మాట్లాడుతూ ...హామీల అమలుపై మార్చి 8 లోగా ప్రకటన చేయకపోతే 10 వేల మంది మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తామని, అన్ని గ్రామాల్లో మహిళలకు కూడగట్టి లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తామని తేల్చిచెప్పారు. “ఏ సోనియా గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ మహిళల ఓట్లు వేయించుకుందో.... అదే సోనియా గాంధీకి లక్షలాది పోస్టు కార్డులను పంపిస్తాం” అని స్పష్టం చేశారు. మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని, మహిళలతో రేవంత్ రెడ్డి సర్కారు ఆటలాడుతోందని, మహిళలను మభ్యపెట్టి మోసం చేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని గుర్తు చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మహిళా అంశాలపై ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.  

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి