నీట్-పీజీ కనీస అర్హత మార్కులు తగ్గింపు
లోకల్ గైడ్
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ -పోస్ట్గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) కనీస అర్హతను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ)మరోసారి తగ్గించింది.కనీసం 5 శాతం మార్కులు సాధించినవారు కౌన్సెలింగ్కు హాజరు కావచ్చునని తెలిపింది.న్యూఢిల్లీ:నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ –పోస్ట్గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ)కనీస అర్హతను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ)మరోసారి తగ్గించింది.కనీసం 5 శాతం మార్కులు సాధించినవారు కౌన్సెలింగ్కు హాజరు కావచ్చునని తెలిపింది.ఇది అన్ని క్యాటగిరీల అభ్యర్థులకు వర్తిస్తుందని చెప్పింది.నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్)తన వెబ్సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.2024 ఆగస్టు 23న ప్రచురించిన నీట్-పీజీ,2024 ర్యాంక్,పర్సంటైల్ స్కోర్లో ఎటువంటి మార్పులు ఉండవని వివరించింది.
Comment List