ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది. 

ప్రధానోపాధ్యాయులు విఠల్ 

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనది. 

గుర్రంపల్లి లో ఘనంగా స్వయంపాలన దినోత్సవం. 

లోకల్. గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం.

ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైనదని,నేటి సమాజంలో ఉపాధ్యాయుల బోధనలతోనే యువత అన్ని రంగాలలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని గుర్రం పల్లి ప్రాథమికొన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్ అన్నారు. గురువారం గుర్రంపల్లి ప్రాథమికొన్నత పాఠశాలలో విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి తమతోటి విద్యార్థులకు చక్కని విద్యా బోధన చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేసిన తమ అనుభవాలను వివరించారు. తమ తోటి విద్యార్థులకు చదువు చెప్పడం తమకెంతో మంచి అనుభూతిని కలిగించిందని విద్యార్థులు తెలిపారు. అలాగే విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కిరణ్ కుమార్ రెడ్డి ,కాంప్లెక్స్ ప్రధానో పాధ్యాయురాలు కె సునీత, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రమాదేవి, ఉపాధ్యాయురాలు సుగుణ,జవేరియా,నిర్మల, గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు   బార్ అసోసియేషన్  ఆధ్వర్యంలో జూబ్లీ క్లబ్ లో హోలీ వేడుకలు  
సంగారెడ్డి, లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హోలీ సంబరాలు రంగురంగుల కలర్స్ ను  న్యాయవాదులు అందరూ...
చెల్పూర్ గ్రామంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపనకు ఏర్పాట్లు 
రంగు రంగుల‌తో కొత్త రేష‌న్ కార్డులు...
వాయిదాల మీద వాయిదాలతో హరిహ‌ర వీర‌మ‌ల్లు....
 వ‌ల వేస్తే చేప‌లు కాదు... కొండ‌చిలువ 
ఆపద్బాంధవుడిగా ఆర్థోపెడిక్ వైద్యులు హర్షవర్ధన్
కేంద్ర ప్రభుత్వం నిదులతో గ్రామ పంచాయతీల అభివృద్ధి