అంగన్‌వాడీల ద్వారా కిషోర బాలికలకు చిక్కీలు, చిరుధాన్యాల పట్టీలు:

అంగన్‌వాడీల ద్వారా కిషోర బాలికలకు చిక్కీలు, చిరుధాన్యాల పట్టీలు:

 లోకల్ గైడ్ :

అంగన్‌వాడీల ద్వారా కిషోర బాలికలకు చిక్కీలు, చిరుధాన్యాల పట్టీలు: మంత్రి సీతక్క అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు, చేర్పులు చేస్తాం. 14 నుంచి 18 ఏండ్లలోపు కిషోర బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పల్లిపట్టీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తాం. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తాం.మహిళా శిశు సంక్షేమ శాఖలోని అన్ని విభాగాలు నిర్దిష్ట గడువును నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని మంత్రి సీతక్క (Seethakka) అన్నారు. చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల శాఖకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని చెప్పారు. అందువల్ల ఎప్పటికప్పుడు బడ్జెట్‌ను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకోసారి పూర్తిస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తాం. ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తిచేసే దిశలో పనిచేయాలి. ఆరేండ్లలోపు చిన్నారులంతా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండేలా చూడాలి. ఈ ఏడాది అంగన్‌వాడీల్లో హాజరు శాతం పెరగాలి. పిల్లల హాజరును మరో 30 శాతం పెంచేలా పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి. తద్వారా చిన్నారుల్లో పోషకార లోపాన్ని నివారించవచ్చు. పిల్లల దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలి. దత్తత ఇచ్చేలోపు, పిల్లల సంరక్షణ బాధ్యతను స్వీకరించేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి. ఆ చిన్నారుల సంరక్షణ బాధ్యతలు చూసుకునే వారికి ఆర్థిక చేయూతనిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.దివ్యాంగులకు అత్యవసరమైన సర్జరీలను ప్రభుత్వమే చేయిస్తుంది. అనుగుణంగా దివ్యాంగులను గుర్తించి అధికారులు సర్జరీ ఏర్పాట్లు చేయాలి. రాజీవ్ యువ వికాస పథకంలో దివ్యాంగులకు 5 శాతం కేటాయిస్తున్నాం. ఈ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలి. కుటుంబంలో దివ్యాంగులుంటే వారి పేరు మీదే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అంశం పరిశీలనలో ఉంది. అంగన్‌వాడీలకు సరఫరా అయ్యే ఆహార నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు, మరింత రుచి కరంగా మార్చేందుకు ఎన్‌ఐఎన్‌, యూనిసెఫ్ వంటి సంస్థలు, నిపుణులతో కమిటీ వేశాం. వారి నివేదిక ఆధారంగా అంగన్‌వాడీలకు సరఫరా అవుతున్న ఆహారంలో మార్పులు, చేర్పులు చేస్తాం. 14 నుంచి 18 ఏండ్లలోపు కిషోర బాలికలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పల్లిపట్టీ, చిరుధాన్యాల పట్టీలు అందిస్తాం. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేస్తాం.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 23 మొబైల్ అంగన్‌వాడీ వాహనాలను ఏర్పాటు చేసి అర్హులందరికీ గుడ్లు, ఆహారం చేస్తున్నాం. టేక్ హోమ్ రేషన్ ఇవ్వడమే కాకుండా.. ఆ ఇండ్లను అంగన్‌వాడీ సిబ్బంది సందర్శించి సరఫరా చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారా లేదా పరిశీలించి అవగాహన పెంచాలి. కిశోర బాలికలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. వారికి కూడా పౌష్టికాహారంపై అవగాహన పెంచాలి. మహిళల్లో ఎనిమియాను ఐదు శాతం తగ్గించేల చర్యలు చేపట్టాలి. ప్రతి మండలంలో కనీసం 3 అంగన్‌వాడీ భవనాలను నిర్మించే పనులను ప్రారంభించాలి.’ అని అధికారులకు సూచించారు.  

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News