నేడు ధరూర్ కు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

నేడు ధరూర్ కు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

లోకల్ గైడ్ : ధరూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం - 2025 అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:05 గంటలకు బేగంపేట, హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 8:50 గంటలకు గద్వాల ఐడిఓసి పి జె పి క్యాంపు వద్దగల హెలిప్యాడ్ కు చేరుకుంటారని తెలిపారు. అధికారులతో కలిసిన అనంతరం రోడ్డు మార్గాన అక్కడి నుండి బయలుదేరి ఉదయం 9:15 గంటలకు ధరూర్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 11 గంటలకు బయలుదేరి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వంగూరి వాచకం -నవరత్నాలు  వంగూరి వాచకం -నవరత్నాలు 
లోకల్ గైడ్: 1. దూసుకుపోయేవారుఆకాశంలో పక్షిలా ఎగిరిపోతారుఊగిసలాడేవారు ఊయలలా ఉన్నచోటే ఆగిపోతారు  2.అధినేత తలుచుకుంటే అందలాలకు కరువు లేదు అనతి కాలంలోనే కర్ణుడు అంగరాజై మెరవలేదా  3....
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలి 
భూ భారతి చట్టం నిజంగా రైతులకు చుట్టం
స్వాతంత్ర్య సమరయోధులు కొండవీటి బచ్చిరెడ్డి, కొండవీటి జగన్మోహన్ రెడ్డి ల విగ్రహాల ఆవిష్కరణ. 
R&R సెంటర్ కు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మంత్రికి వినతి
సూర్యాకే డీసీసీ కిరీటమా?
దళారులను నమ్మి మోసపోవద్దు