క్యాన్సర్ బాధితురాలికి 10లక్షల నగదు సాయం అందించిన జగ్గారెడ్డి

క్యాన్సర్ బాధితురాలికి 10లక్షల నగదు సాయం అందించిన జగ్గారెడ్డి

లోకల్ గైడ్ : సంగారెడ్డి జిల్లా,సదాశివపేట మండలం కు చెందిన ఆమని అనే మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించిన జగ్గారెడ్డి చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 7లక్షల అప్పులు చేశానన్న బాధితురాలు భర్త చనిపోయాడని, ఇద్దరు ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించిన ఆమని ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పిన బాధితురాలు తక్షణమే రూ. 10లక్షలు అందించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్   జగ్గారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి అన్నారు. తనకు సాయం చేసి, వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు. కానీ ఈ సమస్య పది మంది దృష్టికి రావాలని మీడియా దృష్టి కి తీసుకు వచ్చానన్నారు.పేదలకు ఇలాంటి రోగాలు వస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలి క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు ,. ట్రీట్ మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్  బాధితులు పడుతున్న సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళతా మనీ ఆయన అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News