వరంగల్ ఖమ్మం హైవే పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ 

ఇద్దరికి తీవ్ర గాయాలు 

వరంగల్ ఖమ్మం హైవే పై ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ 

క్షతగాత్రులను కాపాడిన పోలీసులను అభినందించిన స్థానిక ప్రజలు.

లోకల్ గైడ్ తెలంగాణ: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో వరంగల్ నుండి ఖమ్మం వైపు వెళ్తున్న యాష్ లారీ ఆగి ఉన్న బొగ్గు లారిని ఒక్కసారిగా ఢీకొట్టింది. దీంతో ఢీ కొట్టిన లారీలోని డ్రైవర్ తీవ్ర గాయాల పాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన స్థలానికి 100 మీటర్ల దూరంలో పోలీస్ చెక్ పోస్ట్ ఉండడంతో  పాటు, అదే సమయంలో వర్ధన్నపేట ఎస్సై చందర్ తన సిబ్బందితో హైవే పెట్రోలింగ్ చేస్తూ ఆ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద  ఆగి ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఎస్ఐ చందర్ తన సిబ్బందితో హుటాహుటిన ప్రమాద సంఘటన స్థలానికి వెళ్లి గోల్డెన్ అవర్ లో జెసిబిల సహాయంతో ఢీ కొట్టిన లారీని విడదీసి అందులో గాయాలపాలైన ఇద్దరిని అంబులెన్స్ సహాయంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  దీంతో  ప్రాణా నష్టం తప్పిందని స్థానికులు పోలీసుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రమాదంలో రెండు లారీలు మాత్రమే ఉన్నాయని నాలుగు లారీలు ఉన్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. ప్రమాద పరిస్థితిని పూర్తిగా తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని వివరించారు. ఇప్పటికే లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా వచ్చి ఢీ కొట్టిన లారీ పై కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

No comments yet.

Latest News

అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీకి ఐదోస్థానం.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..? అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీకి ఐదోస్థానం.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?
ఏప్రిల్ నెలలో దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఐదవ స్థానాన్ని సంపాదించింది. వేసవి కాలంలోనూ ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందకపోవడం గమనార్హం. వేసవిలోనే...
మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు